vijay: దీపావళి కానుకను అందించనున్న కాజల్, విజయ్!

  •  విజయ్ తదుపరి చిత్రంగా తెరకెక్కిన 'మెర్సెల్' 
  •  మూడు పాత్రలు .. ముగ్గురు కథానాయికలు
  • తెలుగులో 'అదిరింది' టైటిల్ తో రిలీజ్
  • హిట్ ఖాయమంటోన్న ఫ్యాన్స్  

తమిళంలో విజయ్ కి మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ వుంది. ఆయన తాజా చిత్రం 'మెర్సెల్' కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఈ నెల 18వ తేదీన విడుదల చేస్తున్నట్టుగా దర్శక నిర్మాతలు చెప్పారు. అదే రోజున తెలుగులోను ఈ సినిమా 'అదిరింది' పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

 శ్రీ తేనాండాళ్ ఫిలిమ్స్ వారికి ఇది 100వ సినిమా. ఆ సెంటిమెంట్ తో వాళ్లు 100 కోట్లతో ఈ సినిమాను నిర్మించారు. వాళ్లతో కలిసి శరత్ మరార్ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ మూడు పాత్రలను పోషించడం విశేషం. ఈ మూడు పాత్రల సరసన కాజల్ .. సమంతా .. నిత్యామీనన్ కథానాయికలుగా నటించారు. అట్లీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, విజయ్ కి మరో బ్లాక్ బస్టర్ ఇవ్వడం ఖాయమనే అభిప్రాయంతో అభిమానులు వున్నారు.      

More Telugu News