rajasekhar: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 'గరుడ వేగ'

  •  రాజశేఖర్ హీరోగా రూపొందిన 'గరుడ వేగ'
  •  కథానాయికగా పూజాకుమార్
  •  సన్నీలియోన్ ఐటమ్ సాంగ్ హైలైట్ 
  •  వచ్చేనెల 3వ తేదీన విడుదల  

రాజశేఖర్ కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'గరుడ వేగ' సినిమా తెరకెక్కింది. దాదాపు పాతిక కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాను వచ్చేనెల 3వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఇటీవలే ఈ సినిమా నుంచి వదిలిన టీజర్ కి అనూహ్యమైన స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమాకి మంచి ఆదరణ లభిస్తుందనే నమ్మకంతో వున్నారు.

ఇంతవరకూ చేయని పాత్రలో .. న్యూ లుక్ తో రాజశేఖర్ ఈ సినిమాలో కనిపించనున్నాడు. పూజా కుమార్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, శ్రద్ధా దాస్ కీలకమైన పాత్రను పోషించింది. ఇక సన్నీలియోన్ చేసిన ఐటమ్ సాంగ్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. రాజశేఖర్ చాలా గ్యాప్ తరువాత వస్తుండటంతో .. అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో ఆయనకి హిట్ దొరుకుతుందేమో చూడాలి. 

More Telugu News