ram. anupama: 'ఉన్నది ఒకటే జిందగీ' ఆడియో రిలీజ్ ముహూర్తం ఖరారు

  • రామ్ హీరోగా తెరకెక్కిన 'ఉన్నది ఒకటే జిందగీ'
  • ఈ నెల 13న ఆడియో ఫంక్షన్
  • అదే రోజున థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్
  • ఈ నెల 27న సినిమా విడుదల    

'హైపర్' పరాజయం తరువాత మరో కథను ఓకే చేయడానికే రామ్ చాలా సమయం తీసుకున్నాడు. తనకి 'నేను శైలజ'తో హిట్ ఇచ్చిన దర్శకుడు కిషోర్ తిరుమలకే ఛాన్స్ ఇచ్చాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో సెట్స్ పైకి వెళ్లిన 'ఉన్నది ఒకటే జిందగీ' షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.

 రామ్ సరసన లావణ్య త్రిపాఠి .. అనుపమ పరమేశ్వరన్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా, ఆడియో ఫంక్షన్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా ఆడియోను ఈ నెల 13వ తేదీన రిలీజ్ చేయనున్నారు. అదే వేదికపై థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ నెల 27వ తేదీన సినిమాను భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. స్నేహం .. ప్రేమ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా, తనకి తప్పకుండా హిట్ తెచ్చుపెడుతుందనే నమ్మకంతో రామ్ వున్నాడు.   

  • Loading...

More Telugu News