dhoni: ధోనీని అబ్బుర పరిచిన విరాట్ కోహ్లీ 'బుల్లెట్ థ్రో'!

  • మైదానంలో పాదరసంలా కదిలిన కోహ్లీ
  • దూరం నుంచి శరవేగంతో బంతిని విసిరిన కెప్టెన్
  • డైరెక్ట్ హిట్ తో డాన్ క్రిస్టియన్ అవుట్
  • సూపర్బ్ ఫీల్డింగన్న కీపర్ ధోనీ

క్రికెట్ మైదానంలో పాదరసంలా కదులుతూ అద్భుతరీతిలో ఫీల్డింగ్ చేసే కోహ్లీ, మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు. నిన్న రాంచీలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ-20 పోరులో భువనేశ్వర్ వేసిన 19వ ఓవర్ లో డాన్ క్రిస్టియన్ షాట్ కొట్టగా, మిడాన్ లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ, చాలా దూరం నుంచి దాన్ని ఓ బుల్లెట్ లా వికెట్లపైకి విసిరేయగా, అది డైరెక్టుగా వచ్చి వికెట్లను తాకి డాన్ ను అవుట్ చేసింది.

బంతికోసం వికెట్ల వెనుక చేతులు పెట్టి ఉన్న ధోనీ, బంతి డైరెక్టుగానే వికెట్లను తాకడంతో ఒక్క క్షణం అబ్బురపడిపోయాడు. ఆ వెంటనే సహచరుడిని అభినందించేందుకు ముందుకు కదిలాడు. బాల్ సూపర్ గా వచ్చి వికెట్లను తాకిందని సైగ చేస్తూ ధోనీ కదిలిన వీడియోను బీసీసీఐ అభిమానులతో పంచుకుంది. ఈ మ్యాచ్ కి వరుణుడు అడ్డు పడగా, డక్వర్త్ లూయిస్ విధానం ప్రకారం, తగ్గించిన ఓవర్లు, పరుగుల లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా అందుకుని విజయం సాధించిన సంగతి తెలిసిందే. కోహ్లీ విసిరిన 'బుల్లెట్ థ్రో' వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్.

  • Loading...

More Telugu News