hindi director: హిందీ చిత్ర దర్శకుడు కుందన్ షా కన్నుమూత

  • గుండెపోటుతో మృతి
  • `జానే భీ దో యారో` సినిమా తీసిన కుంద‌న్‌
  • చివ‌రి చిత్రం `పీ సే పీఎం త‌క్‌`

హిందీలో `జానే భీ దో యారో`, `క‌భీ హా క‌భీ నా` వంటి మాస్ట‌ర్‌పీస్ చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన కుంద‌న్ షా క‌న్నుమూశారు. శ‌నివారం ఉద‌యం గుండెపోటుతో ఆయ‌న త‌న నివాసంలో మృతి చెందిన‌ట్లు తెలుస్తోంది. సినిమాల‌తో పాటు `నుక్క‌ద్‌`, `వాగ్లే కీ దునియా` వంటి టీవీ సీరియ‌ళ్ల‌కు కుంద‌న్ షా దర్శ‌క‌త్వం వ‌హించారు.

ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చివ‌రి సినిమా `పీ సే పీఎం త‌క్‌`. ఈ చిత్రం 2014లో విడుద‌లైంది. సెటైరిక‌ల్ కామెడీకి మారుపేరుగా ఆయ‌న చిత్రాలు నిలిచాయి. ఆయ‌న మృతిపై ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేశారు.

More Telugu News