sowmya: నన్ను మోసం చేసింది... అందుకే చంపేశా: సౌమ్య హంతకుడు కృష్ణయ్య

  • సౌమ్య అంటే నాకు చాలా ఇష్టం
  • ఆరు నెలలుగా మేము ప్రేమించుకుంటున్నాం
  • నన్ను మోసం చేసిందనే హతమార్చా
  • నిందితుడు కృష్ణయ్య  

హైదరాబాదులో హత్యకు గురైన సౌమ్యకు సంబంధించిన పలు విషయాలు వెల్లడయ్యాయి. తనను ఆమె మోసం చేయడం వల్లే హత్య చేశానని నిందితుడు కృష్ణయ్య మీడియాకు తెలిపాడు. హైదరాబాదులోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్ నగర్ లో నివాసం ఉంటున్న సౌమ్య, చింతల్ లోని గీతాంజలి కాలేజ్ లో ఇంటర్ చదువుతోంది. ఏడు నెలల క్రిందట పెళ్లిలో దూరపు బంధువు కృష్ణయ్యతో ఆమెకు పరిచయమైంది. అనంతరం వారి పరిచయం ప్రేమగా మారింది. డ్రైవర్ గా పనిచేసే కృష్ణయ్య గత ఆరు నెలలుగా సౌమ్య, తాను ప్రేమించుకుంటున్నామని తెలిపాడు. ఎంతో ప్రేమిస్తున్నానని చెప్పిన సౌమ్య తనను మోసం చేసిందని అన్నాడు. మోసం చేయడాన్ని తట్టుకోలేకపోయానని చెప్పాడు.

దీనిపై క్లారిటీ కోసం ఆమె కాలేజీకి వెళ్తున్న సమయంలో ఆమెను కలిశానని, హెచ్ఎంటీ సంస్థకు ఎదురుగా ఉన్న నిర్మానుష్య ప్రాంతంలోకి ఆమెను తీసుకెళ్లానని తెలిపాడు. తనను మోసం చేయడంపై అక్కడ ఆమెను నిలదీశానని, ఈ సందర్భంగా జరిగిన వాగ్వాదంతో తనకు పట్టరాని కోపం వచ్చిందని, దీంతో ఆమెను బలంగా కొట్టానని చెప్పాడు. అయితే తాను కొట్టిన దెబ్బ ఆమె ఛాతీకి తగలడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయిందని తెలిపాడు. అనంతరం జీహెచ్ఎంసీ చెత్త బండి సమీపంలో ఓ సంచిని కొనుగోలు చేసి, అందులో సౌమ్య శవాన్ని కుక్కి, అందులో ఒక రాయిని కూడా పెట్టి, ఐడీఎల్ చెరువులో పడేశానని తెలిపాడు. తరువాత పోలీసు స్టేషన్ కు వచ్చి లొంగిపోయానని చెప్పాడు.

  • Loading...

More Telugu News