sushma swaraj: మ‌రో ఇద్ద‌రు పాకిస్థానీల‌కు మెడిక‌ల్ వీసా జారీ చేయ‌నున్న విదేశాంగ శాఖ‌!

  • ఓపెన్ హార్ట్ స‌ర్జ‌రీకి అర్జీ పెట్టుకున్న మూడేళ్ల పాప‌కు
  • కాలేయ మార్పిడి చికిత్స కోసం ఒకరికి 
  • వీసాలు జారీ చేయనున్నట్టు ట్వీట్ చేసిన సుష్మా ‌

పాకిస్థాన్‌కి చెందిన మ‌రో ఇద్ద‌రికి మెడిక‌ల్ వీసా జారీ చేయ‌నున్న‌ట్లు విదేశాంగ మంత్రి సుష్మా స్వ‌రాజ్ తెలిపారు. కాలేయ మార్పిడి చికిత్స కోసం ఒక పాకిస్థానీ రోగికి, అలాగే ఓపెన్ హార్ట్ స‌ర్జ‌రీ అవ‌స‌ర‌మైన ఓ మూడేళ్ల పాప‌కు వీసా జారీ చేయ‌నున్న‌ట్లు ఆమె పేర్కొన్నారు. పాప త‌ర‌ఫున లాహోర్‌కి చెందిన ఉజైర్ హుమాయున్ అనే వ్య‌క్తి అర్జీ మేర‌కు ఆమె ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

ఈ విషయాన్ని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు. పాప త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తున్న‌ట్లు ఆమె ట్వీట్ చేశారు. అలాగే త‌న తండ్రి కాలేయ మార్పిడి చికిత్స కోసం మెడిక‌ల్ వీసా జారీ చేయాల‌ని నూర్మా హ‌బీబ్ పెట్టుకున్న అర్జీకి కూడా ఆమె స‌మాధాన‌మిచ్చారు. `స‌రే.. నూర్మా.. భార‌త్‌లో నీ తండ్రి చికిత్స కోసం మేం వీసా జారీ చేస్తాం. స‌ర్జరీ బాగా జ‌రిగి, ఆయ‌న ఎక్కువ కాలం జీవించాల‌ని ఆశిస్తున్నాం` అని సుష్మా స్వ‌రాజ్ ట్వీట్ చేశారు.

More Telugu News