raj taraun: సంక్రాంతికి సందడి చేయనున్న 'రాజుగాడు'

  •  రాజ్ తరుణ్ హీరోగా 'రాజుగాడు' 
  •  రెండు పాటల మినహా షూటింగ్ పూర్తి
  •  కథానాయికగా అమైరా దస్తూర్
  •  సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు  

రాజ్ తరుణ్ తాజా చిత్రంగా 'రాజుగాడు' తెరకెక్కుతోంది. సంజనా రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకి, రామబ్రహ్మం సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ .. లవ్ .. సెంటిమెంట్ .. కామెడీ .. యాక్షన్ వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ఈ సినిమా రూపొందుతోందని అన్నారు.

 రాజ్ తరుణ్ .. అమైరా దస్తూర్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందనీ, తమ బ్యానర్ పై రాజ్ తరుణ్ చేస్తోన్న మూడవ సినిమా ఇదని చెప్పారు. తమ కాంబినేషన్లో వచ్చిన గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని చెప్పారు. రాజేంద్ర ప్రసాద్ .. రావు రమేష్ పాత్రలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయని అన్నారు. రెండు పాటలు మాత్రమే చిత్రీకరించవలసి ఉందనీ, త్వరలోనే ఆ పనులు కూడా పూర్తి చేసి .. సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తామని చెప్పారు.     

More Telugu News