chintakayala aiyannapatrudu: కోర్టుకు హాజరైన ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు

  • ఎలమంచిలి కోర్టులో అయ్యన్న
  • 2012 పాయకరావు పేట ఎన్నికల కేసు
  • అప్పట్లో కోడ్ నిబంధనలు ఉల్లంఘించిన అయ్యన్న
  • కాంగ్రెస్ పెట్టించిన తప్పుడు కేసని ఆరోపణ

ఆంధ్రప్రదేశ్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈ ఉదయం ఎలమంచిలి కోర్టుకు హాజరయ్యారు. 2012లో పాయకరావుపేట ఉప ఎన్నిక జరుగగా, ఆ సమయంలో ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినట్టు అయ్యన్నపాత్రుడిపై కేసు దాఖలైంది. కోర్టు విచారణకు ఆయన సక్రమంగా హాజరు కాకపోవడంతో ఇటీవల నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా జారీ అయ్యాయి.

 ఈ నేపథ్యంలో కోర్టుకు వచ్చిన ఆయన, న్యాయమూర్తి ఎదుట హాజరై, తనపై ఉన్న ఎన్బీడబ్ల్యూను రీకాల్ చేయించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తనపై పెట్టిన తప్పుడు కేసు ఇదని ఆరోపించారు. న్యాయస్థానాలపై తనకు నమ్మకం ఉందని చెప్పారు.

  • Loading...

More Telugu News