mahesh babu: వంశీ పైడిపల్లి మూవీలోను మహేశ్ జోడీగా రకుల్?

  •  'స్పైడర్'లో మహేశ్ తో జోడీ కట్టిన రకుల్
  •  ఆమె అంకితభావాన్ని మెచ్చుకున్న మహేశ్
  •  వంశీ పైడిపల్లితో చేయనున్న మూవీలోనూ రకుల్ కి ఛాన్స్
  •  కొరటాల మూవీ పూర్తి కాగానే వంశీ పైడిపల్లితో సెట్స్ పైకి  

తెలుగు .. తమిళ భాషల్లో రకుల్ వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. తెలుగులో కోటికి పైగా పారితోషికం తీసుకుంటున్న రకుల్, తమిళంలో రెండు కోట్లు డిమాండ్ చేస్తోందట. అయినా తమ సినిమాల్లో ఆమెను ఖరారు చేసుకోవడానికి దర్శక నిర్మాతలు వెనుకాడటం లేదని అంటున్నారు.

ఈ నేపథ్యంలో మహేశ్ తదుపరి చిత్రంలోనూ రకుల్ కి ఛాన్స్ తగిలిందనే వార్త తాజాగా షికారు చేస్తోంది. మహేశ్ - రకుల్ కాంబినేషన్లో వచ్చిన 'స్పైడర్' భారీ విజయాన్ని సొంతం చేసుకోకపోయినా, ఈ జోడీ బాగుందనే టాక్ వచ్చింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న మహేశ్ తదుపరి సినిమాలోను ఆమెకి చోటు దొరికిందని అంటున్నారు. 'స్పైడర్' సమయంలో రకుల్ హార్డ్ వర్క్ ను మెచ్చుకున్న మహేశ్ కూడా, ఆమె ఎంపిక పట్ల సుముఖంగానే వున్నాడని చెబుతున్నారు. ప్రస్తుతం కొరటాలతో మహేశ్ చేస్తోన్న 'భరత్ అను నేను' షూటింగ్ పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది.   

More Telugu News