ntr: 125 కోట్లతో .. ఆల్ టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్ జాబితాలో 'జై లవ కుశ'

  •  కొనసాగుతోన్న 'జై లవకుశ' జోరు
  •  ఇంతవరకూ 125 కోట్ల గ్రాస్ వసూలు
  •  ఈ ఏడాది ఈ స్థాయి వసూళ్లు సాధించిన 3వ సినిమా ఇది
  •  ఎన్టీఆర్ కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిన సినిమా

దసరా పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని క్రితం నెల 21వ తేదీన 'జై లవ కుశ' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పండుగ రోజుల్లో ఈ సినిమా ఒక రేంజ్ లో సందడి చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్లతో దూసుకుపోయింది. ఇప్పటికీ ఈ సినిమా జోరు తగ్గకపోవడం విశేషం. ఇంతవరకూ ఈ సినిమా 125 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసింది.

 ఈ ఏడాది ఈ స్థాయి వసూళ్లను సాధించిన 3వ సినిమాగా నిలిచింది. ఈ సినిమాకి ముందు 'బాహుబలి 2' .. 'ఖైదీ నెంబర్ 150' వున్నాయి. ఇక తెలుగులో ఆల్ టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచిన చిత్రాల్లో 'జై లవ కుశ' 8వ స్థానాన్ని సంపాదించుకుంది. మొదటి ఏడు స్థానాల్లో బాహుబలి .. బాహుబలి 2 .. ఖైదీ నెంబర్ 150 .. శ్రీమంతుడు .. జనతా గ్యారేజ్ .. అత్తారింటికి దారేది .. సరైనోడు సినిమాలు వున్నాయి. మొత్తానికి ఎన్టీఆర్ మూడు పాత్రలను పోషించిన ఈ సినిమా, ఆయన కెరియర్లో ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.    

More Telugu News