nagarjuna: 'రాజుగారి గది 2' చివరి 20 నిమిషాలు హైలైట్ : నాగార్జున

  •  'రాజుగారి గది 2'లో మెంటలిస్ట్ గా నాగార్జున
  •  వీఎఫ్ఎక్స్ పై దృష్టి పెట్టిన నాగ్
  •  అవుట్ పుట్ అద్భుతం
  •  ఈ నెల 13న సినిమా రిలీజ్

    

నాగార్జున ప్రధాన పాత్రధారిగా 'రాజుగారి గది 2' సినిమా తెరకెక్కింది. ఈ నెల 13వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, ఈ సినిమాలో తాను మెంటలిస్ట్ గా కనిపిస్తానని చెప్పారు. ఈ తరహా హారర్ థ్రిల్లర్ సినిమాలకి వీఎఫ్ఎక్స్ ఎంతో క్వాలిటీతో ఉండవలసిన అవసరం ఉందనీ, లేదంటే ఫీల్ పోతుందని అన్నారు.

 ఈ కారణంగానే వీఎఫ్ఎక్స్ క్వాలిటీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాననీ, అవుట్ పుట్ అద్భుతంగా వచ్చిందని చెప్పారు. సమంతా .. శీరత్ కపూర్ ల పాత్రలకి కూడా ఎంతో ప్రాధాన్యత ఉందని అన్నారు. చివరిలో తనకి .. సమంతాకి మధ్య జరిగే సంభాషణ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందనీ, చివరి 20 నిమిషాలు ప్రేక్షకులను కట్టి పడేస్తాయని చెప్పారు. నానీతో మల్టీ స్టారర్ చేసే ఛాన్స్ ఉందనీ, అలాగే చందూ మొండేటితో ఒక సినిమా చేసే ఆలోచనలో వున్నానని స్పష్టం చేశారు.    

  • Loading...

More Telugu News