akhil: అఖిల్ సినిమాపై ఒక నిర్ణయానికి వచ్చిన నాగ్!

  •  చిత్రీకరణ దశలో అఖిల్ 'హలో'
  •  త్వరగా పూర్తి చేయమంటూ నాగ్ సూచన 
  •  డిసెంబర్లో రిలీజ్ చేసే ఆలోచన
  •  కథానాయికగా కల్యాణి ప్రియదర్శన్

అఖిల్ రెండవ సినిమా 'హలో' ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ చాలావరకూ పూర్తయింది. డిసెంబర్లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా నాగార్జున ముందుగానే చెప్పేశారు. చెప్పిన సమయానికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే పట్టుదలతో నాగ్ వున్నారు.

 అందువల్లనే అక్టోబర్ 15 నాటికి షూటింగును పూర్తి చేయమని విక్రమ్ కుమార్ ను నాగార్జున తొందర చేస్తున్నారట. ఆ తరువాత మిగతా పనులపై పూర్తి దృష్టి పెట్టొచ్చనీ, అనుకున్న అవుట్ పుట్ ను రాబట్టడానికి తగిన సమయం దొరుకుతుందని నాగార్జున భావిస్తున్నారు. విక్రమ్ కుమార్ కూడా సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే వున్నారని అంటున్నారు. కల్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.   

More Telugu News