amy jackson: ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీలో మెరవనున్న ఎమీ జాక్సన్?

  •  ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ దర్శకత్వంలో
  •  ఈ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ
  •  కథానాయికగా ఎమీ జాక్సన్

 'జై లవ కుశ' సక్సెస్ ను ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీతో ఎన్టీఆర్ విదేశాలకి వెళ్లనున్నాడు. ఆ తరువాత కొన్ని రోజుల పాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్న సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకోనున్నాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత ఆయన ఈ సినిమా షూటింగులో పాల్గొంటాడు.

 ఈ సినిమా కోసం కొంతమంది కథానాయికల పేర్లను పరిశీలిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఎమీ జాక్సన్ ను కథానాయికగా ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా వున్నాయనేది తాజా సమాచారం. తమిళ సినిమాలతో బిజీగా ఉంటూ వచ్చిన ఎమీ జాక్సన్ .. చాలా గ్యాప్ తరువాత చేస్తోన్న తెలుగు సినిమా ఇది. అయితే ఈ సినిమాలో ఆమె ప్రధాన కథానాయికగా కనిపిస్తుందా? రెండవ నాయికగా మెరుస్తుందా? అనే విషయంలో స్పష్టత రావలసి వుంది.    

More Telugu News