isis: 'అల్లాహో అక్బర్' అంటూ ఇద్దరు యువతులను దారుణంగా చంపేశాడు

  • 17, 20 ఏళ్ల యువతుల దారుణ హత్య
  • ఉగ్రవాదిని మట్టుబెట్టిన భద్రతాదళాలు
  • తమ పనే అని ప్రకటించుకున్న ఐసిస్

ఉగ్రదాడులతో ఫ్రాన్స్ వణికిపోతోంది. తాజాగా నిన్న మర్సీల్లే నగరంలో మరో ఉగ్రదాడి జరిగింది. సెయింట్ చార్లెస్ రైల్వే స్టేషన్ వద్ద ఓ ఉగ్రవాది 'అల్లాహో అక్బర్' అంటూ 17, 20 ఏళ్ల వయసున్న ఇద్దరు యువతులను దారుణంగా చంపేశాడు. నల్లటి దుస్తులు ధరించిన ఈ ముష్కరుడు ఓ యువతిని గొంతు కోసి హతమార్చాడు, మరో యువతి ఛాతీపై, కడుపులో కత్తితో పొడిచి చంపేశాడు.

ఈ నేపథ్యంలో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాదిని ఘటనా స్థలంలోనే కాల్చి చంపాయి. ఈ దాడికి తామే బాధ్యులమని ఐసిస్ ప్రకటించుకుంది. ఈ ఘటనకు పాల్పడింది తమ సభ్యుడేనని తెలిపింది. దాడికి పాల్పడిన ఉగ్రవాది వయసు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుంది. అతను సాధారణ పాత నేరస్తుడేనని... అతని గురించి స్థానిక అధికారులకు తెలిసే ఉంటుందని కథనాలు వెలువడుతున్నాయి.

More Telugu News