sandeep kishan: 'కేరాఫ్ సూర్య' ఆడియో రిలీజ్ డేట్ ఖరారు

  •  సందీప్ కిషన్ హీరోగా ' కేరాఫ్ సూర్య'
  •  కథానాయికగా మెహ్రీన్
  •  ఈ నెల 5వ తేదీన ఆడియో రిలీజ్
  •  దీపావళికి సినిమా విడుదల          

సందీప్ కిషన్ కథానాయకుడిగా తెలుగు .. తమిళ భాషల్లో 'కేరాఫ్ సూర్య' చిత్రం తెరకెక్కింది. మెహ్రీన్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి, సుశీంద్రన్ దర్శకత్వం వహించాడు. గతంలో ' నా పేరు శివ' సినిమాతో దర్శకుడిగా సుశీంద్రన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు 'కేరాఫ్ సూర్య' మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

 ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో, ఈ నెల 5వ తేదీన ఆడియోను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇమ్మాన్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. దీపావళి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో వున్నారు. 'మహానుభావుడు' సినిమాతో యూత్ లో మెహ్రీన్ కి పెరిగిన క్రేజ్ .. ఈ సినిమాకి బాగా హెల్ప్ అవుతుందని భావిస్తున్నారు.            

More Telugu News