నాగ్ పూర్: చివరి వన్డే: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

  • నాగ్ పూర్ వేదికగా చివరి వన్డే
  • ఇప్పటికే సిరీస్ ను దక్కించుకున్న భారత్
  • నెంబర్ వన్ ర్యాంకుకు ఈ మ్యాచ్ టీమిండియాకు కీలకం

భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ లో చివరి వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నాగ్ పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ ను తిలకించేందుకు అభిమానులు అధిక సంఖ్యలో చేరుకున్నారు.

కాగా, ఐదు వన్డేల సిరీస్ లో 3-1 తేడాతో ఈ సిరీస్ ను భారత్ ఇప్పటికే కైవసం చేసుకుంది. నాల్గో వన్డేలో ఆసీస్ చేతిలో పరాజయం పొందిన టీమిండియాకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఎందుకంటే, ఈ మ్యాచ్ లో కనుక భారత జట్టు విజయం సాధిస్తే వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంకును దక్కించుకుంటుంది. ఇంకా భారత జట్టుతో మూడు టీ20ల సిరీస్ ను ఆస్ట్రేలియా జట్టు ఆడాల్సి ఉంది.

More Telugu News