prabhas: 'సాహో' తరువాత ప్రభాస్ నటించే సినిమా వివరాలివే!

  • ప్రభాస్ సాహో తరువాత సినిమాకు 'జిల్' దర్శకుడు రాధాకృష్ణ సారథ్యం
  • ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది 
  • జ్యోతిష్య శాస్త్రం, హస్తసాముద్రికం నేపథ్యం 
  • థ్రిల్లర్ మూవీ, యాక్షన్ సన్నివేశాలు కీలకం

బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' సినిమాలో నటిస్తున్న సంగతి విదితమే. దీని తర్వాత ‘జిల్‌’ ఫేం రాధాకృష్ణ దర్శకత్వం వహించే సినిమాలో ప్రభాస్ నటిస్తాడు. ఈ సినిమా గురించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ చిత్ర కథ జ్యోతిష్య శాస్త్రం, హస్త సాముద్రికం నేపథ్యంలో నడుస్తుందని తెలుస్తోంది. అంతే కాకుండా ఈ కథను 1985 నాటి వాతావరణంలో జరిగినట్టుగా చూపిస్తారని సమాచారం.

థ్రిల్లర్ కథాంశంతో రూపొందే చిత్రమిదని, ఇందులో యాక్షన్ సన్నివేశాలకు కీలక ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఎక్కువ భాగం విదేశాల్లో తెరకెక్కిస్తారని తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ నిర్మించే ఈ చిత్రం 2018 ద్వితీయార్థంలో సెట్స్ పైకి వెళ్తుంది. 

More Telugu News