dhanush: ధనుష్ సరసన సాయి పల్లవి... `మారి-2` లో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిన ఫిదా పిల్ల‌

  • హీరోయిన్‌ పాత్ర కొత్త‌గా ఉంటుంద‌న్న నిర్మాత‌లు
  • తెలుగు, త‌మిళ భాష‌ల్లో సినిమా నిర్మాణం
  • సంగీత ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌నే విష‌యంపై అభిమానుల ఆస‌క్తి

మ‌ల‌యాళం `ప్రేమ‌మ్‌`లో మ‌ల‌ర్‌గా, `ఫిదా`లో భానుమ‌తిగా ప్రేక్ష‌కుల మ‌న‌సులు దోచుకున్న సాయి ప‌ల్ల‌వి, త‌మిళ హీరో ధ‌నుష్ స‌ర‌స‌న న‌టించే ఛాన్స్ కొట్టేసింది. `మారి (తెలుగులో `మాస్‌`)` సినిమాకు సీక్వెల్‌గా తెర‌కెక్కనున్న `మారి -2` చిత్రం కోసం సాయి ప‌ల్ల‌విని హీరోయిన్‌గా ఎంచుకున్న‌ట్లు నిర్మాణ సంస్థ వూండ‌ర్‌బార్ ఫిల్మ్స్ వెల్ల‌డించింది.

ఈ సినిమాలో సాయి ప‌ల్ల‌వి పాత్ర చాలా కొత్త‌గా ఉంటుంద‌ని నిర్మాత‌లు చెబుతున్నారు. ఇప్ప‌టికే విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న‌ పీఎల్ విజ‌య‌న్ `క‌ణం` సినిమా త‌ర్వాత సాయి ప‌ల్లవి న‌టించ‌నున్న రెండో త‌మిళ సినిమా ఇది. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి తీయ‌నున్నారు. ఈ చిత్రానికి బాలాజీ మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. ఈ సినిమా మొద‌టి భాగానికి అనిరుధ్ ర‌విచంద‌ర్ అందించిన సంగీతం హైలైట్‌గా నిలిచింది. అయితే ప్ర‌స్తుతం అనిరుధ్, ధ‌నుష్‌కి మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌చ్చిన కార‌ణంగా రెండో భాగానికి ఎవ‌రు సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నార‌నే అంశం ఆస‌క్తిగా మారింది.

More Telugu News