chiranjeevi: పార్కుకు 'చిరంజీవి- పవన్' పేరు పెట్టాలన్న ఓ వర్గం.. కుదరదన్న మరో వర్గం.. ఘర్షణ.. పలువురికి గాయాలు!

  • పార్క్ కు పేరు పెట్టే విషయంలో గొడవ
  • రెండు వర్గాల మధ్య ఘర్షణ
  • పలువురికి గాయాలు

ప్రభుత్వ స్థలం విషయంలో ఏర్పడిన చిన్న వివాదం... పరస్పర దాడుల వరకు వెళ్లిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలోని ఉరదాళ్లపాలెంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, ఓ ప్రభుత్వ స్థలంలో పార్క్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఆ పార్క్ కు చిరంజీవి, పవన్ కల్యాణ్ అనే పేరు పెట్టాలని ఓ వర్గంవారు డిమాండ్ చేశారు. వీరి ప్రయత్నాలను మరో వర్గంవారు అడ్డుకున్నారు.

ఇక్కడ మొదలైన గొడవ... చివరకు ఇరు వర్గీయులు పరస్పరం దాడులు చేసుకునేంత వరకు వెళ్లింది. ఈ దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో, పరిస్థితులు చేజారకుండా ఉండేందుకు గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు. ప్రస్తుతం ఉరదాళ్లపాలెంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

More Telugu News