kajal: అప్పట్లో అబ్బాయిలు వెంట పడుతుంటే గర్వంగా ఉండేది... ఇప్పుడు కామన్: హీరోయిన్ కాజల్

  • చదువుకునే రోజుల్లో అవన్నీ సాధారణం
  • ఎన్నడూ అబ్బాయిలను ప్రోత్సహించలేదు
  • అనుభూతిని ఆస్వాదించేదాన్ని: కాజల్

తాను చదువుకునే రోజుల్లో అబ్బాయిలు వెంట పడుతూ ఉంటే కాస్తంత గర్వంగా ఉండేదని, సినిమాల్లోకి వచ్చాక ఇటువంటివి చాలా కామన్ అయిపోయాయని చెబుతోంది అందాల నటి కాజల్. ప్రస్తుతం కల్యాణ్ రామ్ సరసన 'ఎమ్మెల్యే' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న కాజల్, తెరపైకి రాకముందే తనకు అభిమానుల తాకిడి ఎక్కువగానే ఉండేదని అంటోంది.

"అప్పట్లో అబ్బాయిలు వెంట పడుతూ ఉంటే సీరియస్ గా తీసుకునే దాన్ని కాదు. ఆ వయసులో అది సాధారణమే కదా. అదంతా ఆకర్షణే. దీనికితోడు అబ్బాయిలు మా గురించి ఆలోచిస్తూ, మమ్మల్నే చూస్తుంటే గర్వంగానూ ఉంటుంది. వాళ్లపై ఇంట్లో ఫిర్యాదు చేసేదాన్ని కాదు. అంతమాత్రాన వాళ్లను ఎన్నడూ ప్రోత్సహించలేదు కూడా. కేవలం ఆ ఎక్స్ పీరియన్స్ ను ఆస్వాదిస్తూ ఉండేదాన్ని" అని తన అనుభవాలను చెప్పుకొచ్చింది.

More Telugu News