durga puja: దుర్గా పూజ కోసం పాట రాసిన ప‌శ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి!

  • `సురుచి సంఘ‌` పూజ థీమ్ సాంగ్‌కి మ‌మ‌తా బెన‌ర్జీ లిరిక్స్‌
  • స్వ‌రాలు స‌మ‌కూర్చిన జీత్ గంగూలీ
  • ఆల‌పించిన శ్రేయా ఘోష‌ల్‌

ప‌శ్చిమ బెంగాల్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రిగే `సురుచి సంఘ‌` వారి దుర్గా పూజ కోసం ఆ రాష్ట్ర‌ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ పాట రాశారు. ఈ మ‌ధ్య‌ దుర్గా పూజ కోసం థీమ్ సాంగ్‌లు ట్రెండ్‌గా మారుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ముఖ్యమంత్రితో పాట రాయించాల‌ని `సురుచి సంఘ‌` పూజ నిర్వాహ‌కులు అనుకున్నారు. గ‌తంలో కూడా మ‌మ‌తా బెన‌ర్జీ ఈ పూజ కోసం పాట రాశారు.

ఈ సారి ప్ర‌త్యేకంగా సురుచి సంఘ వారు వీడియో కూడా రూపొందించారు. ఈ పాట‌కు ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు జీత్ గంగూలీ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. ప్ర‌ముఖ గాయ‌ని శ్రేయా ఘోష‌ల్ ఈ పాట‌ను ఆల‌పించారు. `బోయిచిత్రోర్ ముక్తే` అంటూ ప్రారంభ‌మ‌య్యే ఈ పాట వీడియో లింక్‌ల‌ను మ‌మ‌తా బెన‌ర్జీ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ల‌లో షేర్ చేశారు.

More Telugu News