apcc: కృష్ణా జిల్లా, విజ‌య‌వాడ న‌గ‌ర కాంగ్రెస్ సంస్థాగత ఎన్నిక‌ల ప్ర‌క్రియ పూర్తి: ఏపీఆర్వో టీకే రామ్

  • ఏపీసీసీ కార్యాల‌యం నుంచి ప్ర‌క‌ట‌న  
  • కృష్ణా జిల్లా నియోజ‌క వ‌ర్గాల వారీగా బూత్ క‌మిటీలు, బ్లాక్ క‌మిటీల‌ ఏర్పాటు

అఖిల భార‌త కాంగ్రెస్ క‌మిటీ ఆదేశాల మేర‌కు కృష్ణా జిల్లా, విజ‌య‌వాడ న‌గ‌ర కాంగ్రెస్ క‌మిటీ సంస్థాగ‌త ఎన్నిక‌ల ప్ర‌క్రియ పూర్తి అయిన‌ట్లు ఆంధ్రప్ర‌దేశ్ పార్టీ ఉప ఎన్నిక‌ల అధికారి టీకే రామ్ (ఏపీఆర్వో) తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న ఏపీసీసీ కార్యాల‌యం నుంచి ఈ రోజు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. కృష్ణా జిల్లా పార్టీ ఎన్నిక‌ల అధికారి (డీఆర్వో) విల్లాస్ ఆటేడురావు ఆధ్వ‌ర్యంలో ఎన్నిక‌ల ప్ర‌క్రియ పూర్త‌యింద‌న్నారు.

ఇందులో భాగంగా కృష్ణా జిల్లా నియోజ‌క వ‌ర్గాల వారీగా బూత్ క‌మిటీలు, బ్లాక్ క‌మిటీల‌ను నియ‌మించామ‌న్నారు. ఆ వివ‌రాల‌ను ఈ రోజు డీసీసీ అధ్య‌క్షుడు ధ‌నేకుల ముర‌ళి, న‌గ‌ర కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఆకుల శ్రీనివాస్ కు అందించిన‌ట్లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ఏపీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి న‌ర‌సింహారావు, అధికార ప్ర‌తినిధి వెన్న‌ ర‌మేశ్ త‌దిత‌రులు పాల్గొన్నారు. 

More Telugu News