మ‌హేశ్ క‌త్తి: మేమేమ‌న్నా క‌క్ష కట్టి రివ్యూలు రాస్తున్నామా?: మ‌హేశ్ క‌త్తి

  • అభ‌ద్ర‌తా భావంతోనే కొంద‌రు సినిమావారు మాపై విమర్శలు చేస్తున్నారు
  • మేము కూడా ప్రేక్ష‌కులలాంటి వారిమే
  • బాగుంటే బాగుంద‌ని, లోపాలు ఉంటే ఉన్నాయని రాస్తాం

గ‌త ఏడాది 'బిచ్చ‌గాడు' అనే సినిమా వ‌చ్చింద‌ని, ఆ సినిమాపై ఒక్క‌రు కూడా రివ్యూలు రాయ‌లేద‌ని, ఆ సినిమా సూప‌ర్ హిట్ అయింద‌ని సినీ విశ్లేష‌కుడు మ‌హేశ్ క‌త్తి అన్నారు. అలాగే 'పెళ్లి చూపులు' అనే సినిమా వ‌చ్చింద‌ని దానిపై అంద‌రు రివ్యూలు బాగానే రాశార‌ని, 'అర్జున్ రెడ్డి' సినిమాపై కూడా రివ్యూలు బాగానే రాశార‌ని, ఆ సినిమాల‌పై ఎవ‌రైనా కక్ష ‌గట్టి రివ్యూలు రాశారా? అని ప్ర‌శ్నించారు.

రివ్యూల‌పై వ‌స్తోన్న వివాదంపై మ‌హేశ్ క‌త్తి ఈ రోజు ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ... సినిమాను బ‌ట్టి రివ్యూ ఉంటుంది కానీ, సినిమాల‌పై క‌క్షతో రివ్యూలు రాస్తామా? అని నిల‌దీశారు. అభ‌ద్ర‌తా భావంతోనే త‌మ‌పై కొంద‌రు సినిమావారు ఇటువంటి వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని అన్నారు.

తాము కూడా ప్రేక్ష‌కులలాంటి వారిమేన‌ని, కాక‌పోతే సినిమాల‌ను విశ్లేషించ‌గ‌ల‌మ‌ని అన్నారు. సినిమాను ప్రేమించాం కాబ‌ట్టే తాము విశ్లేష‌కులమ‌య్యామ‌ని అన్నారు. విశ్లేష‌కుల‌ను వ‌చ్చి సినిమా తీయ‌మ‌నండ‌ని కొంద‌రు అంటున్నార‌ని, త‌మ ప‌ని సినిమాను విశ్లేషించ‌డ‌మేనని అన్నారు. సినిమా బాగుంటే బాగుంద‌ని, లోపాలు ఉంటే ఉన్నాయని రాస్తామ‌ని అన్నారు. అంతేగాని, సినిమా గురించి అన్నీ తెలుస‌ని తామేం విర్ర‌వీగ‌డం లేద‌ని అన్నారు.  

More Telugu News