jd chakravarthi: 'లక్ష్మీస్ ఎన్టీఆర్' నిర్మాతగా జేడీ చక్రవర్తి?

  •  'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా కోసం వర్మ సన్నాహాలు
  •  నిర్మాత జేడీ చక్రవర్తి అంటూ టాక్
  •  ఆయన లక్ష్మీ పార్వతితో చర్చించినట్టు సమాచారం

ఎన్టీఆర్ జీవితచరిత్రను తెరకెక్కించనున్నట్టు చెప్పిన రామ్ గోపాల్ వర్మ, కొన్ని కారణాల వలన వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరుతో తన సినిమా ఉంటుందని చెప్పాడు. ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి సంబంధించిన నేపథ్యం ఈ సినిమాలో కథా వస్తువుగా ఉంటుందని అన్నాడు. లక్ష్మీ పార్వతి కోణంలో ఈ సినిమా కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చాడు.

 ఈ సినిమాను ఎవరు నిర్మిస్తారు? అనే ప్రశ్న అందరిలోను తలెత్తింది. ఈ నేపథ్యంలో నిర్మాతగా జేడీ చక్రవర్తి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. రామ్ గోపాల్ వర్మతో జేడీ చక్రవర్తికి మంచి సాన్నిహిత్యం వుంది. ఈ కారణంగా ఈ సినిమాను నిర్మించడానికి ఆయన ముందుకు వచ్చినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఆల్రెడీ ఆయన లక్ష్మీ పార్వతిని కలిసి ఈ విషయంపై చర్చలు జరిపినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతో చూడాలి మరి. 

More Telugu News