sandeep kishan: ఆసక్తిని రేకెత్తిస్తోన్న 'కేరాఫ్ సూర్య' టీజర్ .. ఆల్ ది బెస్ట్ చెప్పిన నాని

  • సందీప్ కిషన్ తదుపరి సినిమాగా 'కేరాఫ్ సూర్య' 
  •  తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల 
  •  ఆల్ ది బెస్ట్ చెప్పిన నాని
  •  కథానాయికగా మెహ్రీన్    

సందీప్ కిషన్ కథానాయకుడిగా దర్శకుడు సుశీంద్రన్ 'కేరాఫ్ సూర్య' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సందీప్ సరసన కథానాయికగా మెహ్రీన్ నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ .. కామెడీకి ప్రాధాన్యతనిస్తూ ఈ టీజర్ ను కట్ చేశారు. కథానాయకుడి పాత్ర స్వరూప స్వభావాలను ఆవిష్కరించిన తీరు బాగుంది.

యూత్ ను ఆకట్టుకునే అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా వున్నట్టుగా తెలుస్తోంది. ఈ టీజర్ చూసిన నాని తనకి బాగా నచ్చేసిందనే విషయాన్ని తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. తెలుగులో సందీప్ కిషన్ ను సక్సెస్ పలకరించి చాలాకాలమే అయింది. దాంతో ఆయన సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ హిట్ ఈ సినిమాతో లభించడం ఖాయమనే ఆశతో వున్నాడు. ఆయన ఆశను ఈ సినిమా నెరవేర్చుతుందేమో చూడాలి.


More Telugu News