ntr: సక్సెస్ సంబరాలకు రెడీ అవుతోన్న ఎన్టీఆర్ టీమ్!

  •  కొనసాగుతోన్న 'జై లవ కుశ' జోరు
  •  తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో వసూళ్లు
  •  ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల షేర్
  •  సక్సెస్ సంబరాలకు ఏర్పాట్లు  

'జై లవ కుశ' విడుదలైన ప్రతి ప్రాంతం నుంచి మంచి రెస్పాన్స్ ను రాబడుతూ దూసుకుపోతోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 40 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 50 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ సక్సెస్ సంబరాలు జరుపుకోవడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. వీలైనంత వరకూ ఈ రోజు సాయంత్రమే ఈ సక్సెస్ సంబరాలు వుంటాయని అంటున్నారు. కథానాయకుడిగా ఎన్టీఆర్ కి హ్యాట్రిక్ హిట్ ను ఇచ్చిన సినిమా కావడం, నిర్మాతగా కల్యాణ్ రామ్ కి దక్కిన భారీ సక్సెస్ కావడంతో, ఈ సంబరాలను గ్రాండ్ గా జరపనున్నారని చెబుతున్నారు. ఈ సక్సెస్ పట్ల ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషీగా వున్నారు.   

More Telugu News