nagachaitanya: 'సవ్యసాచి' ఇబ్బందుల్లో పడిందా?

  •  చందూ మొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి'
  •  కథ విషయంలో వివాదం
  •  దానిని పరిష్కరించుకునే పనిలో దర్శకుడు
  •  చైతూ పెళ్లి తరువాతే సెట్స్ పైకి    


నాగచైతన్య తదుపరి చిత్రంగా చందూ మొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి' తెరకెక్కనుంది. ఈ సినిమాలో కథానాయకుడి ఎడమ చేయి పనితీరుపై అతని నియంత్రణ ఉండదు. అదే ఈ సినిమాలో ఆసక్తిని రేకెత్తించే అంశం .. కథను నడిపించే విషయం. ఈ కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందనుందని తెలియగానే అందరిలోనూ ఆసక్తి మొదలైంది.

అయితే ఈ కథ తనది అని డైమండ్ రత్నం .. రైటర్స్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేశాడట. ప్రస్తుతం ఈ విషయానికి సంబంధించిన వివాదం కొనసాగుతూనే ఉందని అంటున్నారు. ఈ వివాదానికి తెరపడితేనే గాని .. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లదు. నాగచైతన్య కూడా ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీగా వున్నాడు. ఆ తరువాతనే ఆయన ఈ సినిమా షూటింగ్ కి హాజరుకానున్నాడు. ఆ లోగా ఈ వివాదం పరిష్కారమవుతుందేమో చూడాలి.    

  • Loading...

More Telugu News