india: కొత్త స్పిన్నర్ ఇడుగో... ఇక కాచుకోండి: బీసీసీఐ

  • ప్రాక్టీస్ సెషన్ లో సరదాగా స్పిన్ బౌలింగ్ వేసిన ధోనీ
  • ఆ వీడియోను అభిమానులతో షేర్ చేసుకున్న బీసీసీఐ
  • ఆఫ్ బ్రేక్స్, లెగ్ బ్రేక్స్ వేస్తూ కనిపించిన ధోనీ

భారత క్రికెట్ టీమ్ లో స్పిన్ ద్వయం యజువేంద్ర చాహల్, కుల్ దీప్ యాదవ్ లు రాణిస్తుండగా, మూడో వన్డే నేపథ్యంలో, భారత్ కు మరో కొత్త స్పిన్నర్ వచ్చి చేరాడని బీసీసీఐ, తన అధికార వెబ్ సైట్ లో ఓ వీడియోను పోస్టు చేయగా అది వైరల్ గా మారింది. మరికాసేపట్లో భారత్, ఆస్ట్రేలియాల మధ్య మూడో వన్డే మ్యాచ్ జరుగనుండగా, ఈ ఉదయం జరిగిన ప్రాక్టీస్ సెషన్ లో మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ధోనీ, సరదాగా కాసేపు బౌలింగ్ చేశాడు.

దానికి సంబంధించిన వీడియోనే బీసీసీఐ అభిమానులతో పంచుకుంటూ, "భారత స్పిన్ బౌలింగ్ అటాకింగ్ ఎవరు చేరారో చూడండి" అంటూ వ్యాఖ్యానించింది. ఈ వీడియోలో ఆఫ్ బ్రేక్స్, లెగ్ బ్రేక్స్ లను ధోనీ సులువుగా సంధిస్తుండటం కనిపిస్తోంది. కాగా, గతంలోనూ అప్పుడప్పుడు గ్లౌజెస్ పక్కన బెట్టిన ధోనీ, సరదాగా బౌలింగ్ కు దిగిన సంగతి తెలిసిందే.

ఈ తాజా వీడియోను చూసిన పలువురు, ధోనీ మూడో వన్డేలో బౌలింగ్ చేయాలని డిమాండ్ చేస్తుండటం గమనార్హం. తమ అభిమాన ఆటగాడు బ్యాటింగ్, కీపింగ్ తో పాటు, కెప్టెన్సీని, స్పిన్, ఫేస్ బౌలింగ్ ను కూడా వేయగలడని కామెంట్లు పెడుతున్నారు.

More Telugu News