rajani: చైనాలో '2.0' భారీ రిలీజ్ ఖాయమైంది!

  •  చైనాలోను భారీ సంఖ్యలో రజనీకి ఫ్యాన్స్
  • అక్కడ ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు నిర్మాతల ప్రకటన 
  •  16 వేల థియేటర్స్ లో రిలీజ్
  •  ఐమ్యాక్స్ వెర్షన్ తో పాటు త్రీడీ వెర్షన్ కూడా   

చైనాలో భారతీయ సినిమాలను రిలీజ్ చేయాలంటే అందుకు ఒక ప్రాతిపదిక ఉంటుంది. ఏడాదికి ఇన్ని భారతీయ సినిమాలను మాత్రమే అక్కడ విడుదల చేయాలంటూ అక్కడి ప్రభుత్వం అనుమతినిస్తుంది. ఆ రేషన్ లో అక్కడ విడుదలైన 'దంగల్' వసూళ్ల పరంగా ఎలాంటి రికార్డును సృష్టించిందో తెలిసిందే. ఆ తరువాత రజనీ తాజా చిత్రం '2.0'న అక్కడ ప్రదర్శించడానికి అనుమతి లభించింది.

 వచ్చే ఏడాది ఈ సినిమాను అక్కడ విడుదల చేయడానికి ముందుగానే బెర్త్ ను ఖరారు చేసుకున్నారు. చైనాలోను రజనీకాంత్ కి పెద్ద సంఖ్యలోనే ఫ్యాన్స్ వున్నారు. అందువలన ఈ సినిమాను అక్కడ దాదాపు 16 వేల థియేటర్స్ లో విడుదల చేయనున్నట్టు సమాచారం. ఐ మ్యాక్స్ వెర్షన్ తో పాటు త్రీడీ వెర్షన్ ను కూడా విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా అక్కడ ఏ రేంజ్ లో దూసుకుపోతుందో .. ఏ స్థాయి వసూళ్లను రాబడుతుందో చూడాలి.  

More Telugu News