Jayalalitha: ఆ రోజు శశికళకు భయపడి అన్నీ అబద్ధాలే చెప్పాం.. క్షమించండి!: జ‌య‌ల‌లిత మృతిపై తమిళనాడు మంత్రి దిండిగ‌ల్ శ్రీనివాస‌న్

  • శశికళకు భయపడి మేము జయలలిత ఆరోగ్య పరిస్థితిపై అబద్ధాలు చెప్పాము
  • జ‌య‌ మృతికి శ‌శిక‌ళ కుటుంబ‌మే కార‌ణం
  • ఆసుపత్రిలో ఉన్న జయలలితను ‌శశిక‌ళ బంధువులు మమ్మల్ని చూడనివ్వలేదు
  • శ‌శిక‌ళ మాట‌లు విని  ప్ర‌జ‌ల‌కు అబద్ధాలు చెప్పాము

త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత గ‌త ఏడాది సెప్టెంబ‌రు 22న ఆసుప‌త్రిలో చేరి, ఆ త‌రువాత డిసెంబ‌ర్ 5న గుండెపోటుతో మృతి చెందిన విష‌యం తెలిసిందే. కాగా, ఈ రోజు త‌మిళ‌నాడు మంత్రి, అన్నాడీఎంకే సీనియ‌ర్‌ నేత దిండిగ‌ల్ శ్రీనివాస‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. జ‌య‌మృతికి శ‌శిక‌ళ కుటుంబ‌మే కార‌ణమ‌ని చెప్పారు. శ‌శిక‌ళ వ‌ర్గానికి భ‌య‌ప‌డే తాము జ‌య‌ల‌లిత‌ అనారోగ్యం గురించి కొన్ని అబ‌ద్ధాలు చెప్పామ‌ని అన్నారు. ఆసుపత్రిలో జయలలిత ఆరోగ్య పరిస్థితి మెరుగు పడుతోందని తాము చెప్పాల్సి వచ్చిందని తెలిపారు.

జ‌య‌ల‌లితను చూడ‌డానికి ఆసుప‌త్రికి వ‌చ్చిన వారిని శ‌శిక‌ళ బంధువులు ఓ రూంలోనే కూర్చోబెట్టి మాట్లాడి పంపించేవార‌ని శ్రీనివాసన్ చెప్పారు. శ‌శిక‌ళ గురించి నిజాలు చెప్ప‌నందుకు త‌న‌ను క్ష‌మించాల‌ని కోరారు. శ‌శిక‌ళ మాట‌లు విని తాము ప్ర‌జ‌ల‌కు అబద్ధాలు చెప్పామ‌ని అన్నారు. ఆసుప‌త్రిలో జ‌య‌ల‌లిత పేప‌రు చ‌దువుతున్నార‌ని, సాంబార్‌తో ఇడ్లీ తిన్నార‌ని చెప్పామ‌ని తెలిపారు. అందుకే ప్ర‌జ‌లంతా ఆమె కోలుకుంటోంద‌నే భావించార‌ని అన్నారు. నిజానికి త‌న‌తో పాటు అమ్మ‌ను ఎవ్వ‌రూ చూడ‌లేద‌ని చెప్పారు. అమ్మ మాట్లాడుతోంద‌ని, ఇడ్లీ తిన్నార‌ని ఆమెను త‌మ క‌ళ్ల‌తో చూశామ‌ని ఆనాడు చెప్పిన విష‌యాల‌న్నీ అబ‌ద్ధాలేన‌ని అన్నారు. 

  • Loading...

More Telugu News