Nivetha Thomas: మొదటి మూడు సినిమాలు హిట్ కావడంతో ‘జై లవకుశ’ భామ నివేదా థామస్‌ హర్షం.. తెలుగులో కృత‌జ్ఞ‌త‌ లేఖ!

  • ‘జెంటిల్‌మన్‌’, ‘నిన్ను కోరి’, ‘జై లవకుశ’ సినిమాల్లో నటించిన నివేదా థామస్‌
  • టాలీవుడ్ నన్ను తమ అమ్మాయి అని పిలుస్తోంది 
  • ఇంతకన్నా పెద్ద ప్రశంస ఏమీ ఉండదు
  • ఎలా కృత‌జ్ఞ‌త‌లు చెప్పినా అది తక్కువే
  • మరో మంచి సినిమాలో, మరో పాత్రతో ప్రేక్ష‌కుల‌ ముందుకు వస్తా

‘జెంటిల్‌మన్‌’, ‘నిన్ను కోరి’, ‘జై లవకుశ’ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ నివేదా థామస్ భావోద్వేగపూరిత ట్వీట్ చేసింది. తాను నటించిన మొదటి మూడు సినిమాలను బాగా ఆదరించారని పేర్కొంటూ ఓ లేఖ రాసి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. టాలీవుడ్ తనను ఇలా సొంత మనిషిలా చూడటం కన్నా పెద్ద ప్రశంస తనకు ఏమీ ఉండదని పేర్కొంది. తెలుగు సినీ పరిశ్రమ తనను తమ అమ్మాయి అని పిలుస్తోందని, దీనిని ఆశీర్వాదంగా భావిస్తున్నానని తెలిపింది.

తన అభిమానులకు, కుటుంబ సభ్యులకు ఎలా కృత‌జ్ఞ‌త‌లు చెప్పినా అది తక్కువేన‌ని నివేదా థామస్ చెప్పింది. త‌న కొత్త సినిమా ‘జై లవకుశ’ను ఆద‌రిస్తున్నందుకు థ్యాంక్స్ అని పేర్కొంది. తాను మరో మంచి సినిమాలో, మరో పాత్రతో ప్రేక్ష‌కుల‌ని క‌లుస్తాన‌ని తెలిపింది. మలయాళీ భామ అయిన‌ నివేదా థామస్.. నాని స‌ర‌స‌న‌ త‌న‌ మొద‌టి రెండు సినిమాల్లో న‌టించింది. ఆ వెంట‌నే ఎన్టీఆర్‌తో క‌లిసి న‌టించే ఛాన్స్ కొట్టేసింది. త‌న సినిమాల‌కు వ‌స్తోన్న ఆద‌ర‌ణ ప‌ట్ల ఈ ముద్దుగుమ్మ ఇలా హ‌ర్షం వ్య‌క్తం చేసింది.  

  • Loading...

More Telugu News