ntr: 100 కోట్ల మార్క్ దిశగా పరుగులు తీస్తోన్న 'జై లవ కుశ'

  •  తొలి రోజున భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన 'జై లవ కుశ' 
  •  రెండో రోజుకి మరింతగా పెరిగిన వసూళ్లు
  •  వీకెండ్ పూర్తయ్యేనాటికి 100 కోట్ల మార్క్ ను అధిగమిస్తుందనే అంచనా
  •  ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషీ      

భారీ తారాగణంతో .. భారీ అంచనాలతో 'జై లవ కుశ' చిత్రం విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజున భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ఈ సినిమా, రెండో రోజుతో కలుపుకుని 80 కోట్లవరకూ వసూలు చేసిందని ట్రేడ్ అనలిస్టులు పేర్కొంటున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను శని .. ఆదివారాల్లో మరింతగా వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ వీకెండ్ ముగిసే నాటికి ఓవర్సీస్ లో ఈ సినిమా 2 మిలియన్ మార్క్ ను చేరుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

 ప్రపంచవ్యాప్తంగా రాబట్టే వసూళ్లను చూసుకుంటే, ఈ వీకెండ్ లో 100 కోట్ల మార్క్ ను అధిగమించవచ్చని అంటున్నారు. అదే జరిగితే ఎన్టీఆర్ కెరియర్లో అత్యంత వేగంగా 100 కోట్లను కొల్లగొట్టిన చిత్రంగా 'జై లవ కుశ' నిలుస్తుందని చెబుతున్నారు. 'నాన్నకు ప్రేమతో' .. ' జనతా గ్యారేజ్' .. ' జై లవ కుశ' ఇలా ఒక దానిని మించి మరొకటి హిట్ కొట్టడం పట్ల ఎన్టీఆర్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.      

More Telugu News