ntr: తొలి రోజున 'జై లవ కుశ' మొత్తం వసూళ్లు!

  •  'జై లవ కుశ'కు భారీ ఓపెనింగ్స్ 
  •  తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు షేర్ 21.86 కోట్లు
  •  తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు గ్రాస్ 32 కోట్లు
  •  తొలి రోజు వరల్డ్ వైడ్ షేర్ 29. 28 కోట్లు      

ఎన్టీఆర్ కథానాయకుడిగా రూపొందిన 'జై లవ కుశ' మొన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. తొలి రోజు వసూళ్ల విషయంలో ఈ సినిమా కొన్ని ప్రాంతాల్లో నాన్ 'బాహుబలి' రికార్డులను అధిగమిస్తే, మరికొన్ని ఏరియాల్లో 'బాహుబలి' రికార్డులను బీట్ చేయలేక పోయింది.

తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున ఈ సినిమా 21.86 కోట్ల షేర్ ను సాధించి, 32 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే 29.28 కోట్ల షేర్ ను రాబట్టింది. తొలి సారిగా ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయడం ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలిచింది. ఈ మూడు పాత్రల మధ్య గల వేరియేషన్స్ ను ఎన్టీఆర్ అద్భుతంగా పండించడం ..  ఆ పాత్రల స్వభావాలను దృష్టిలో పెట్టుకుని దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ ను కంపోజ్ చేయడం ఈ సినిమాకి బాగా కలిసొచ్చిందని అంటున్నారు. శని .. ఆదివారాల్లో వసూళ్లు మరింత ఊపందుకోవడం ఖాయమని చెబుతున్నారు.      

More Telugu News