గుట్టు విప్పు... కోటి పట్టు: కేంద్రం కొత్త ఆఫర్
- 'బినామీ గుట్టు విప్పు.. నజరానా పట్టు' పథకం
- బినామీల గుట్టు విప్పేందుకు ప్రజల సాయం కోరిన కేంద్రం
- రహస్యాలు చెప్పిన వారి వివరాలు గోప్యం
- బినామీల వివరాలు చెప్పిన వారికి పట్టుబడ్డ ఆస్తిని బట్టి నజరానా
- 15 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల నజరానా
అలాగే సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతారు. ప్రస్తుతం ఉన్న విధానంతో బినామీల ఆటకట్టడం కష్టంగా ఉందని, అదే ఇన్ఫార్మర్ విధానాన్ని తీసుకొచ్చి, రక్షణ కల్పిస్తే బినామీల గురించి ప్రజలే చూసుకుంటారని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ పథకాన్ని అమలులోకి తీసుకురానుందని సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ (సీబీడీటీ) ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.