Dawood Ibrahim: తండ్రిని కలుసుకునేందుకు రహస్యంగా భారత్ వచ్చి వెళ్లిన దావూద్ ఇబ్రహీం భార్య!

  • సోదరుడు అనీస్ ఇబ్రహీం, చోటా షకీల్ తో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్న మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం
  • పాక్ లో దావూద్ కి నాలుగు ఇళ్లు 
  • గతేడాది భారత్ కు వచ్చిన దావూద్ భార్య
  • తన తండ్రిని కలుసుకునేందుకు వచ్చింది 

బిల్డర్ ను బెదిరించిన కేసులో అరెస్టైన మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ పోలీసు విచారణలో కీలక విషయాలు వెల్లడిస్తున్నాడు. పాకిస్థాన్ లో దావూద్ కి నాలుగు ఇళ్లు ఉన్నాయని కస్కర్ చెప్పాడు. ఆ ఇంట్లోనే దావూద్ మరో సోదరుడు అనీస్ ఇబ్రహీం, అనుచరుడు చోటా షకీల్ తదితరులు కుటుంబాలతో కలసి ఉన్నారని తెలిపాడు. అంతే కాకుండా, దావూద్ ఇబ్రహీం భార్య మెహజబీన్‌ షేక్‌ అలియాస్‌ జుబీనా జరీన్‌ గతేడాది ముంబై వచ్చిందని అతను చెప్పగా, తెలుసుకున్న పోలీసులు షాక్ తిన్నారు. తన తండ్రి సలీమ్‌ కశ్మీరీని కలుసుకునేందుకు జుబీనా గతేడాది ముంబైకి వచ్చిందని కస్కర్ విచారణలో వెల్లడించాడు. 

More Telugu News