sj surya: ఇక దర్శకుడిగా విశ్రాంతి .. నటనపైనే దృష్టి : ఎస్.జె.సూర్య

  • దర్శకుడిగా సూపర్ హిట్లు ఇచ్చిన ఎస్.జె. సూర్య 
  •  నటుడిగాను సత్తా చాటుకుంటున్నాడు
  •  'స్పైడర్'లోను .. 'మెర్సెల్'లోను ఆయనే విలన్
  •  ఇకపై నటుడిగానే కొనసాగాలనే నిర్ణయం       

కోలీవుడ్ అగ్ర దర్శకుల జాబితాలో ఎస్.జె. సూర్య పేరు కూడా కనిపిస్తుంది. 'వాలి' ... 'ఖుషీ' వంటి బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చింది ఆయనే. అలాంటి సూర్య ఆ తరువాత ఆ స్థాయి విజయాలను అందుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే తనలోని నటుడికి ఆయన పని చెప్పాడు. ఆ మధ్య తమిళంలో వచ్చిన 'ఇరైవి' సినిమా నటుడిగా ఆయన ప్రతిభను చాటి చెప్పింది. అప్పటి నుంచి ఆయన నటనపైనే పూర్తి దృష్టి పెట్టాడు.

రీసెంట్ గా ఆయన మహేశ్ బాబు 'స్పైడర్' లోను .. విజయ్ 'మెర్సెల్' లోను విలన్ గా చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇకపై మెగాఫోన్ పట్టుకోవాలనుకోవడం లేదని చెప్పాడు. నటుడిని కావాలనే తాను ఇండస్ట్రీకి వచ్చాననీ .. కొన్ని పరిస్థితుల్లో దర్శకుడిగా మారానని అన్నాడు. దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాక నటుడిగా మారే ఛాన్స్ వచ్చిందని చెప్పాడు. అందువలన ఇప్పుడు తనలోని దర్శకుడికి విశ్రాంతినిచ్చి, నటుడిగానే ముందుకు వెళ్లాలనుకుంటున్నానని చెప్పుకొచ్చాడు.      

More Telugu News