road accident: ఫ్లైఓవర్ పైనుంచి కింద పడ్డ ప్రభుత్వ వాహనం.. ఆరుగురి దుర్మరణం!

ఫ్లైఓవర్ పైనుంచి పభుత్వ వాహనం ఒకటి కింద పడ్డ ప్రమాదంలో ఆరుగురు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన తమిళనాడులోని తిరువూరు జిల్లా థెక్కలూర్ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరణించిన వారంతా పురుషులే. వీరు చెన్నైకు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆరు లైన్ల రోడ్డుపై ప్రయాణిస్తున్న ఈ వాహనం ఓ బస్సును ఢీకొని అదుపుతప్పింది. అనంతరం ఫ్లైఓవర్ పై నుంచి కిందకు పడిపోయింది. తీవ్రంగా గాయపడ్డ డ్రైవర్ కు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి కూడా సీరియస్ గా ఉందని వైద్యులు తెలిపారు.

More Telugu News