'అలయ్ బలయ్'కి చంద్రబాబును ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకే విజయవాడకు వచ్చా!: దత్తాత్రేయ
ప్రతి ఏడాది దసరా అనంతరం హైదరాబాదులో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయతీ అని... ఆ కార్యక్రమానికి చంద్రబాబును ముఖ్య అతిధిగా ఆహ్వానించేందుకు వచ్చానని చెప్పారు. ఈ సాయంత్రం చంద్రబాబుతో భేటీ అవుతున్నానని తెలిపారు. ఇరు తెలుగు రాష్ట్రాలు పరస్పర సహకార భావంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.