ntr: 'జై లవ కుశ' తొలి రోజున నైజామ్ వసూళ్లు!

  •  నైజామ్ లో 'జై లవకుశ' దూకుడు
  •  సీడెడ్ లోను అదే జోరు 
  •  ఓవర్సీస్ లోను దూసుకుపోతోంది 
  •  తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున 20 కోట్ల షేర్ వసూలు చేసి ఉండొచ్చని అంచనా      

ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేసిన 'జై లవకుశ' నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకి ముందే భారీగా అంచనాలను పెంచేసిన ఈ సినిమా, తొలిరోజున భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. తొలి రోజున ఈ సినిమా నైజామ్ లో 5.05 కోట్ల షేర్ ను రాబట్టింది. సీడెడ్ లో 3.77 కోట్ల షేర్ ను వసూలు చేసింది. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున ఈ సినిమా 20 కోట్ల షేర్ ను వసూలు చేసే ఛాన్స్ ఉందని అంచనా.

 ఇక ఓవర్సీస్ లో ఈ సినిమా ప్రీమియర్స్ ద్వారా హాఫ్ మిలియన్ మార్క్ ను అందుకుంది. ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రలను పోషించడం .. వాటిలో 'జై' పాత్ర అందరిలోను ఆసక్తిని రేకెత్తించడం .. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఆడియన్స్ ను ఆకట్టుకోవడం .. రాశిఖన్నా గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవడం .. ఇలా ఈ సినిమాకి అన్నీ కలిసొచ్చాయని అంటున్నారు. అందుకే ఈ స్థాయి వసూళ్లు అని చెబుతున్నారు.     

More Telugu News