narendra modi: న‌రేంద్రమోదీ భ‌యంతో ర‌క్ష‌ణ క‌ట్టుదిట్టం చేసుకున్న దావూద్‌?

  • ఇప్ప‌టికీ నాలుగు సార్లు ర‌క్ష‌ణ స్థావ‌రం మార్చిన వైనం
  • కుటుంబంతో ట‌చ్‌లోనే ఉండే మాఫియా డాన్‌
  • వెల్ల‌డించిన త‌మ్ముడు ఇక్బాల్ కాస్క‌ర్‌

కేంద్రంలో న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం త‌న ర‌క్ష‌ణ భ‌ద్ర‌త‌ల‌ను 50 శాతం మేర‌కు పెంచిన‌ట్లు తెలుస్తోంది. అక‌స్మికంగా జ‌రిగే పోలీసుల దాడులను ఎదుర్కోవ‌డానికి దావూద్ నాలుగు సార్లు ర‌క్ష‌ణ స్థావ‌రాల‌ను మార్చాడ‌ని ఇటీవ‌ల పోలీసుల చేతికి చిక్కిన అత‌ని త‌మ్ముడు ఇక్బాల్ కాస్క‌ర్ వెల్ల‌డించాడు.

ప్ర‌స్తుతం పాకిస్థాన్ నుంచి కార్యాక‌లాపాలు సాగిస్తున్న దావూద్‌, న‌రేంద్ర‌మోదీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి చాలా స్థావ‌రాలు మారిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో కాస్క‌ర్ బ‌య‌ట‌పెట్టాడు. ఎన్ని స్థావ‌రాలు మారినా కుటుంబంతో దావూద్ ఎప్పుడూ ట‌చ్‌లోనే ఉంటాడ‌ని, కాకపోతే ఫోన్లో మాత్రం మాట్లాడేవాడు కాద‌ని కాస్క‌ర్ తెలిపాడు. దావూద్ అక్ర‌మ వ్యాపారాల గురించి కూడా కాస్క‌ర్ బ‌య‌ట‌పెట్టాడు. మెక్సికోకు చెందిన డ్ర‌గ్ కార్టెల్‌తో దావూద్‌కి సంబంధాలు ఉన్న‌ట్లు కాస్క‌ర్ వెల్ల‌డించాడు.

More Telugu News