uber: కేరళలో ఉబెర్ డ్రైవర్ ను చితకబాదిన టీవీ చానల్ ఉద్యోగినులు అరెస్ట్!

  • షేరింగ్ పద్ధతిలో క్యాబ్ బుక్ చేసుకున్న యువతులు
  • అప్పటికే కారులో ఉన్న యువకుడిని దించేయాలని గొడవ
  • వారించిన డ్రైవర్ పై దాడి

ఓ క్యాబ్ ను షేరింగ్ పద్ధతిలో బుక్ చేసుకున్న ముగ్గురు అమ్మాయిలు, అప్పటికే కారులో ఉన్న యువకుడిని కిందకు దించేయాలని డ్రైవర్ తో గొడవపడి, అతన్ని చితకబాదిన కేసులో అరెస్టయ్యారు. కొచ్చి సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ముగ్గురు అమ్మాయిలూ ఓ టీవీ చానల్ లో పని చేస్తున్నారని వెల్లడించిన పోలీసులు, వారిపై కేసు నమోదు చేశామని అన్నారు.

ఉబెర్ డ్రైవర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, వీరు ఉబెర్ లో పొరపాటును షేరింగ్ ఆప్షన్ ను ఎంచుకుని, క్యాబ్ బుక్ చేసుకున్నారు. అప్పటికే ఆ కారులో ఉన్న యువకుడు ఫ్రంట్ సీట్ లో కూర్చోగా, అతన్ని దించివేయాలని అమ్మాయిలు వాగ్వాదానికి దిగారు. అలా కుదరదని డ్రైవర్ చెప్పడంతో దాడికి దిగారు. ఈ ముగ్గురినీ క్లారా షిబిన్ (28), షీజా అఫ్సల్ (30), ఏంజల్ మేరీ (36)గా గుర్తించామని, కేసును విచారిస్తున్నామని తెలిపారు.

More Telugu News