TRS: గుత్తా సుఖేందర్ రెడ్డి మరదలు ఆత్మహత్య!

నల్గొండ టీఆర్ఎస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కుటుంబంలో విషాదం అలముకుంది. ఆయన సోదరుడు గుత్తా మహేందర్ రెడ్డి భార్య శ్రీలత (45) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిన్న రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. జిల్లాలోని చిట్యాల మండలం ఉరుమడ్లలో వీరు నివసిస్తున్నారు. గుత్తా మహేందర్ రెడ్డి గ్రామంలో ఓ ప్రైవేట్ స్కూల్ ను నిర్వహిస్తున్నారు. అనారోగ్య కారణాల వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News