Rai lakshmi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • 'స్కిన్ షో'కి ఓకే అంటున్న రాయ్ లక్ష్మి 
  • ఓవర్సీస్ లో 'జై లవకుశ' భారీ ఎత్తున రిలీజ్ 
  • నిర్మాణానంతర పనుల్లో 'ఇంద్రసేన' 

*  అందాలభామ రాయ్ లక్ష్మి మొదటి నుంచీ కూడా ఎక్స్ పోజింగ్ విషయంలో ముందే ఉంటోంది. తాజాగా తాను హిందీలో చేస్తున్న 'జూలీ 2' చిత్రంలో కూడా బాగా ఎక్స్ పోజ్ చేసిందనే వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమ్మడు మాట్లాడుతూ, కథ ప్రకారం అవసరమైతే స్కిన్ షోకి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పింది.
*  'జై లవ కుశ' సినిమాతో ఎన్టీఆర్ ఓవర్సీస్ మార్కెట్లో వ్యక్తి గతంగా ఓ రికార్డు కొడుతున్నాడు. ఈ చిత్రాన్ని అక్కడ 190 లొకేషన్లలో 500 స్క్రీన్లపై విడుదల చేస్తున్నారు. ఎన్టీఆర్ సినిమాల విడుదల పరంగా ఓవర్సీస్ లో ఇదొక రికార్డనే చెప్పాలి.
*  'బిచ్చగాడు' సినిమాతో వెరైటీ కథా చిత్రాలను చేస్తాడని పేరు తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ తాజాగా నటిస్తున్న చిత్రం 'ఇంద్రసేన'. ఈ చిత్రం షూటింగును పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. దీనికి జి.శ్రీనివాసన్ దర్శకత్వం వహిస్తున్నాడు.       

More Telugu News