mohan babu: 1400 మందితో మోహన్ బాబుపై పాట చిత్రీకరణ!

  • మోహన్ బాబు సొంత బ్యానర్లో 'గాయత్రి'
  •  శంకర్ మహదేవన్ పాట తిరుపతిలో చిత్రీకరణ
  • 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు
  •  400 మంది డాన్సర్లు  

మోహన్ బాబు ప్రధాన పాత్రగా 'గాయత్రి' చిత్రం రూపొందుతోంది. మదన్ దర్శకత్వంలో ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను తిరుపతిలో ప్లాన్ చేసినట్టు సమాచారం. శంకర్ మహదేవన్ పాడిన ఒక పాటను మోహన్ బాబుపై తిరుపతిలో చిత్రీకరించనున్నారు.

 ఈ పాటలో వేయిమంది జూనియర్ ఆర్టిస్టులు .. నాలుగు వందల మంది డాన్సర్లు పాల్గొననున్నారని అంటున్నారు. ఆర్ట్ డైరెక్టర్ చిన్నా అధ్వర్యంలో తిరుపతిలో వేసిన భారీ సెట్స్ ఈ పాటకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు. మొత్తం 1400 మంది నేపథ్యంలో రూపొందనున్న ఈ సాంగ్, ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో, నిఖిలా విమల్ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది.     

  • Loading...

More Telugu News