allu aravind: కొత్తవాళ్ల కోసం పెట్టిన బ్యానర్ ఇది : అల్లు అరవింద్

  •  వి - 4 బ్యానర్లో తొలి సినిమాగా 'నెక్స్ట్ నువ్వే'
  •  ఈ బ్యానర్ గురించి మాట్లాడిన అల్లు అరవింద్
  •  యువ దర్శకులను ప్రోత్సహించడమే ఈ బ్యానర్ ఉద్దేశం  
  • కొత్తగా ఆలోచించేవారికి ఆహ్వానం పలుకుతుంది  

టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో అల్లు అరవింద్ ఒకరు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఆయన ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. ఇక ఈ మధ్య గీతా ఆర్ట్స్ 2 అనే బ్యానర్ ను కూడా ఏర్పాటు చేసి వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే బన్నీ వాసు .. జ్ఞానవేల్ రాజా .. యూవీ క్రియేషన్స్ తో కలిసి ఆయన 'వి - 4 క్రియేషన్స్' అనే పేరుతో మరో బ్యానర్ ను ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్ పై రూపొందిన తొలి సినిమాగా 'నెక్స్ట్ నువ్వే' ప్రేక్షకుల ముందుకు రానుంది.

 ఈ బ్యానర్ ఏర్పాటు చేయడంలో గల ఉద్దేశాన్ని తాజాగా అల్లు అరవింద్ చెప్పారు. కొత్త దర్శకులతో కొత్త ఆలోచనలను పంచుకుంటూ నిర్మాతగా వాళ్లతో కలిసి ప్రయాణించడానికే ఈ బ్యానర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. యువ దర్శకులు కొత్త ఆలోచనలతో ముందుకువస్తే, వారిని ప్రోత్సహించడం కోసం ఈ బ్యానర్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. 

More Telugu News