kcr plant: సీఎం కేసీఆర్ నాటిన మొక్క ఎండిపోవడంతో.. అర్ధరాత్రి వచ్చి కొత్త మొక్కనాటిన అధికారులు

మూడో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కరీంనగర్‌ జిల్లా మానేరు కట్ట వద్ద మహాఘని మొక్కను నాటగా.. అది ఎండిపోయినట్లు ఇటీవ‌ల మీడియా దృష్టికి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దీంతో సంబంధింత అధికారులు త‌ప్పును దిద్దుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఆ నాడు కేసీఆర్ నాటిన మొక్క‌ను తొలగించి మరో మొక్కను నాటించారు. మొక్క‌ల‌ను పెట్ట‌డ‌మే కాదని, వాటిని సంర‌క్షించాల‌ని అప్పుడే హ‌రితహారం విజ‌య‌వంత‌మ‌వుతుంద‌ని కేసీఆర్ ప‌దే ప‌దే చెప్పిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు కేసీఆర్ నాటిన మొక్కే ఎండిపోవ‌డంతో అధికారులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఆ మొక్కను సంరక్షించడంలో అధికారులు శ్రద్ధ చూపించలేదు. ఆ ఎండిపోయిన మొక్క‌ను గ‌త‌ అర్ధరాత్రి 12 గంటల తర్వాత తొల‌గించి కొత్త మొక్క‌ను నాట‌డం గ‌మ‌నార్హం. 

More Telugu News