PV sindhu: తొలి పాయింట్ తో బోణీ కొట్టిన పీవీ సింధు... భారత అభిమానుల కేరింతలతో దద్దరిల్లిపోతున్న స్టేడియం!

తొలి పాయింట్ సాధించగానే చప్పట్లతో మార్మోగిన స్టేడియం

ఉత్సాహంగా సాగుతున్న కొరియా ఓపెన్ ఫైనల్

స్వల్ప ఆధిక్యంలో ఉన్న సింధూ

విక్టర్ కొరియా బ్యాడ్మింటన్ ఫైనల్ పోరు కొద్దిసేపటి క్రితం పీవీ సింధు, జపాన్ క్రీడాకారిణి ఒకుహరా మధ్య ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో తొలిగా సర్వ్ చేసిన పీవీ సింధు, తొలి పాయింట్ ను సాధించగానే స్టేడియంలోని అభిమానులు ఆనందంతో కేరింతలు కొట్టారు. స్టేడియం నిండా భారత అభిమానులు లేనప్పటికీ, ప్రతి పాయింట్ కూ ఆమెకు అభిమానుల చప్పట్లతో మద్దతు లభిస్తూనే ఉంది. ఈ మ్యాచ్ లో సింధూ విజయం సాధించి, వరల్డ్ బ్యాడ్మింటన్ ఫైనల్ పోరులో ఒకుహరా నుంచి తనకు ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతి బ్యాడ్మింటన్ అభిమానీ కోరుకుంటున్నాడు. ప్రస్తుతం తొలి సెట్ లో సింధూ 6-5 తేడాతో స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది.

More Telugu News