accident: హృదయవిదారక ఘటన... తల్లి కళ్లముందే ఆర్తనాదాలు చేస్తూ కొడుకు మృతి!

  • వరంగల్‌లోని కాజీపేట ఫాతిమానగర్‌ బ్రిడ్జి సమీపంలో ఘటన
  • బైక్ పై వెళుతుండగా యువకుడిని ఢీ కొన్న బస్సు
  • 20 నిమిషాల తరువాత వచ్చిన అంబులెన్స్
  • తన కొడుకుని కాపాడాలని కన్నీరు పెట్టుకున్న తల్లి

వ‌రంగల్‌లోని కాజీపేట ఫాతిమానగర్‌ బ్రిడ్జి సమీపంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. బస్సు కిందపడిపోయిన ఓ యువ‌కుడు తీవ్ర‌గాయాల‌తో కొన ఊపిరితో ఆర్త‌నాదాలు చేశాడు. అక్క‌డ‌కు చేరుకున్న ఆ యువ‌కుడి త‌ల్లి ఆ దృశ్యాన్ని చూసి త‌ల్ల‌డిల్లిపోయింది. చివ‌రికి త‌న క‌ళ్ల ముందే త‌న కుమారుడు ప్రాణాలు కోల్పోవ‌డం చూసి ఆ త‌ల్లి గుండెలు బాదుకుంటూ రోదించింది.

పూర్తి వివ‌రాల్లోకి వెళితే, సోమిడికి చెందిన సుంచు విక్రం (23) త‌న ఉద్యోగానికి బైక్‌పై వెళుతున్నాడు. బ్రిడ్జి దిగుతున్న సమయంలో విక్రమ్ బైక్ ను ఓ బ‌స్సు ఢీ కొట్టింది. దీంతో అత‌డు కింద పోయాడు. ఆ బ‌స్సు విక్ర‌మ్‌ పైనుంచే వెళ్లిపోయింది. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. 20 నిమిషాల త‌రువాత అంబులెన్స్ వ‌చ్చింది. ఇంత‌లో ఈ స‌మాచారం అందుకున్న విక్ర‌మ్‌ తల్లి రమ, తండ్రి వనరాజ్‌లు అక్క‌డ‌కు వ‌చ్చారు. తన కొడుకుని కాపాడాలంటూ ఆ త‌ల్లి దీనంగా అడుగిన తీరు అందర్నీ కదిలించింది. అంబులెన్స్ లోనే విక్రమ్ కన్నుమూశాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.  

More Telugu News