ntr: హైదరాబాద్ లో 100 థియేటర్స్ లో 'జై లవ కుశ'

  •  'జై లవకుశ' పై పెరుగుతోన్న ఆసక్తి
  •  అన్ని ఏరియాల్లోను అత్యధిక థియేటర్లు
  •  రాశి ఖన్నా, నివేదా థామస్ ల గ్లామర్ ప్రత్యేక ఆకర్షణ
  •  ఈ నెల 21వ తేదీన భారీ రిలీజ్      

బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన 'జై లవ కుశ' సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ, ఎన్టీఆర్ అభిమానుల్లో ఆత్రుత పెరిగిపోతోంది. ఈ నెల 21వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రలు పోషించిన ఈ సినిమాపై, భారీ అంచనాలు వున్నాయి. అందువలన అత్యధిక థియేటర్స్ లో విడుదల చేయనున్నారు.

 ఒక్క భాగ్యనగరంలోనే ఈ సినిమాను 100 థియేటర్స్ లో ప్రదర్శించనున్నట్టు చెబుతున్నారు. దీనిని బట్టి ఎన్టీఆర్ కి గల క్రేజ్ ను .. ఈ సినిమాపై ఆడియన్స్ లో గల ఆసక్తిని అర్థం చేసుకోవచ్చు. నైజామ్ తో పాటు మిగతా ఏరియాల్లోను ఎక్కువ థియేటర్స్ నే తీసుకున్నట్టు తెలుస్తోంది. మూడు పాత్రల్లో ఎన్టీఆర్ లుక్స్ .. రాశి ఖన్నా .. నివేదా థామస్ గ్లామర్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి.    

More Telugu News